కరోనా మహమ్మారి మన సాధారణ జీవితాలను అనేకవిధాలుగా ప్రభావితం చేసింది.ఇది భారతదేశ పురోగతి సైతం మందగించేందుకు కారణం అవుతోంది.ఒక్కసారిగా, ఎంతో మంచి జీవితాలు అనుభవించిన అనేకమంది, ఇప్పుడు తాము జీవితాలు తిరిగి రాతియుగం నాటి పరిస్థితులకు నెట్టబడ్డాయని భావిస్తున్నారు.
మెరుగైన జీవితం కొరకు నగరాలకు వలస వచ్చినవారు ఇప్పుడు తమ గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)కు తిరిగి వచ్చారు.
సర్వీస్లను భద్రపరచలేం లేదా తిరిగి వినియోగించుకోలేం కనుక సర్వీస్ సెక్టార్లో అనేక మంది జీవనోపాధి దెబ్బతింది.ఈ ప్రకంపనలు రాజకీయ ప్రపంచంలో సైతం ప్రతిధ్వనిస్తున్నాయి.
రాజకీయాలు, దాని స్వభావరీత్యా, అనివార్యంగా ఇతరులను కలుసుకోవడంతో ముడిపడి ఉంటుందినిరంతరం బిజీగా ఉండే రాజకీయ నాయకులు- ప్రజలతో మీటింగ్ల కొరకు బయటకు వెళుతున్నారు, చిన్న ఈవెంట్ల నుంచి పెద్ద ర్యాలీల వరకు నిర్వహిస్తున్నారు, మరియు రోజువారీగా నిలకడగా పలువురిని కలుస్తున్నారు.వారు అనివార్యంగా ప్రజల మధ్య ఉండాల్సిన పరిస్థితి.వారికి, ప్రజలను కలవడం వారి నుంచి పొందేస్పందన వారికి ఒక టానిక్లా పనిచేస్తుంది.
కరోనా మహమ్మారి వీటన్నింటిని పూర్తిగా మార్చేసింది.రాజకీయ నాయకులకు, సామాజిక దూరం అంటే ప్రజలతో ప్రత్యక్ష సంబంధం తీవ్రంగా పరిమితం అవుతుంది.పెద్ద సమావేశాలు ఇక ఏమాత్రం నిర్వహించలేరు.
ప్రమాదాన్ని మదింపు చేసుకున్న తరువాత బయటకు వెళ్లడం మరియు ప్రజలను కలవాలనే ప్రతి నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది.
ఎన్నికలు వస్తున్నట్లయితే, ఈ సవాళ్లు మరింత పెరుగుతాయి.కరోనా మహమ్మారి కాలంలో ప్రచారం ఎలా జరుగుతుంది?సింగిల్ మొబైల్ స్క్రీన్ మీద కనిపించడం అనేది, బహిరంగ మైదానంలో ఉన్న అదే అభిరుచితో నివాదాలు చేసే పదివేలమందికి ధీటైన వాతావరణాన్నికలిగిస్తుందా?
ఈ నేపథ్యంలో, కొత్త మహమ్మారి అనంతర రాజకీయాలు ఎలా ఉంటాయి?రాజకీయ నాయకులకు, వారి పార్టీలకు డిజిటల్ జమానాలోనికి మొట్టమొదటిసారిగా వచ్చిన ఓటర్ల ప్రభావం ఎలా ఉంటుంది?ఇది ఇప్పటికే పెద్దదిగా మారి, మరింత బలపడుతుందా, లేదా కొత్త సవాళ్లను విసురుతుందా?
మరిముందుగా, డిజిటల్ పరంగా మాట్లాడాలంటే రాజకీయాలు ఎలా మారాయి అనే దానిని మనం ఇప్పుడు చూద్దాం.
టెక్నాలజీ పెరుగుదల
2009 ఎన్నికల్లో SMS, అవుట్బౌండ్ వాయిస్ కాల్స్ పెద్ద ఎత్తున ఉపయోగించారు.అయితే చాలా వరకు, రాజకీయాలు ఆఫ్లైన్ డొమైన్లో ఉన్నాయి-పెద్ద ర్యాలీలు, సంప్రదాయ మీడియా, భౌతికంగా ప్రచారం చేయడం డామినేట్ చేశాయి.
2014 నాటికి, సోషల్ మీడియాని ఉపయోగించడం పెరిగింది.ప్రచారంలో ఫేస్బుక్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది.డేటా ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం ప్రారంభించింది- అనుకూలమైన ఫలితాల కొరకు ఏ సీట్లు, బూత్లు మరియు ఓటర్లను లక్ష్యంగా చేసుకోవాలనేది గుర్తించడం జరిగింది.(అస్వీకారం:నేను నీతిసెంట్రల్ వంటి మీడియా ప్లాట్ఫారాల ద్వారా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్న ఒక నటుడిని.)
వాట్స్అప్, ట్విట్టర్ మరియు ఫేస్బుక్లను విస్తృతంగా ఉపయోగించడంతో 2019 ఎన్నికలు డిజిటల్ నిమగ్నతాపరంగా అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాయి.ఇది భారతదేశపు మొట్టమొదటి సోషల్ మీడియా ఎన్నికలుగా చెప్పవచ్చు.బిజెపి నమో యాప్, కాంగ్రెస్ శక్తి యాప్ని తీసుకొచ్చాయి. ఓటరల్లో ఎంపిక చేసిన మద్దతుదారుల్లో సందేశాన్ని చేరవేయగల మధ్యవర్తులకు (పార్టీ కార్యకర్తలు మరియు ప్రేరేపిత వాలంటీర్లు) అధికారం ఇవ్వడం జరిగింది. వీరు ఓటర్ల్లో ఎంచుకున్న మద్దతుదారులకు సందేశాన్ని అందిస్తారు.
ఓటర్లను మూడు కేటగిరీలుగా విభజించవచ్చు: పార్టీ విధేయులు (లేదా నిబద్ధత గల ఓటర్లు), నాన్-అలైన్డ్ (లేదా స్వింగ్ ఓటర్లు) మరియు ఓటర్లు కానివారు.ఈ మూడు వర్గాలు కూడా, ఒక్కొక్కటి మొత్తం ఓటర్ల్లో మూడోవంతు ఉంటుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో సుమారు 27 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయలేదు.లోక్నీతి పోస్ట్-పోల్ సర్వే ప్రకారం, ఓటు వేసినవారిలో, దాదాపు సగంమంది ప్రచారం సమయంలో లేదా వారు ఓటు వేయడానికి ముందు రోజుల్లో లేదా గంటల్లో తమ నిర్ణయం తీసుకున్నారు.పార్టీకి నిబద్ధంగా ఉండేవారి విషయంలో అభ్యర్ధులు పెద్దగా పట్టించుకోరు, వారికి కూడా పార్టీ గుర్తు ప్రధానమవుతుంది.
ఈ విధంగా, 90 కోట్ల మంది ఓటర్లలో మనకు సుమారుగా 30-30-30 విభజన ఉంది:తమ అభిమాన పార్టీకి గుర్తు ఆధారంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉండే 30 కోట్ల మంది పార్టీ విధేయులు, ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోవడానికి పోలింగ్ రోజు దగ్గర వరకు వేచి ఉండే 30 కోట్ల మంది నాన్-అలైన్డ్ (NA), అలానే ఓటువేయకుండా ఉండే 30 కోట్ల మంది ఓటర్లు(NV) ఉన్నారు.
NA మరియు NV సెగ్మెంట్లను ఎలా ఒప్పించాలనేది రాజకీయ నాయకులు ఎదుర్కొనే ప్రధాన సవాలు.ఎన్నికలను స్వింగ్ చేయగల NA గుర్తించి ఆలోచించండి – 2019లో వారు బిజెపికి అసాధారణమైన విజయాన్ని అందించారు (2019 లో 303 సీట్లలో 230 స్థానాలను బిజెపి గెలుచుకుంది, 50% కంటే ఎక్కువ ఓట్ల వాటాతో; 1984లో కాంగ్రెస్ విజయం సాధించిన దానికంటే మరుగైన గెలుపు శాతంతో.)
NA ఓటర్లు ఒప్పించాల్సిన అవసరం ఉంటుంది కనుక NA ఓటర్లు చాలా కీలకమైనది.గాలి లేదా సానుకూల పవనాలు వీయడం కీలకం- అప్పుడు జరిగే వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఇది సృష్టించబడుతుంది.ఎన్నికల ప్రచార సమయంపై కరోనా మహమ్మారి కాటువేసిన నేపథ్యంలో, ఈ ఓటర్లను ఎలా ఒప్పించాలనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతుంది.
NV విభాగం వారు తమ మనసు మార్చుకోవాలని ఓటు వేయాలని నిర్ణయించుకుంటే వారు కూడా కీలకమైనవారు కావొచ్చు.వారిని ఊ హించడం కష్టం కావొచ్చు, వారు కొన్ని ఆశ్చర్యాలను కలిగించవచ్చు.పట్టణాలకు వలసపోయిన అనేకమంది ఇప్పుడు గ్రామాలకు తిరిగి వచ్చారు- వారు ఇప్పటికే ఓటర్లుగా నమోదు చేసి ఉంటారు.చాలా ఎన్నికల్లో, కొంతమంది తమ గ్రామాలకు తిరిగి వెళ్లి, ఓటు వేయడానికి ఇబ్బంది పడతారు..ఇప్పుడు వారు ఓటు వేస్తే, వారు ఓటింగ్ని స్వింగ్ చేస్తారా?ఇది యువతకు కూడా వర్తిస్తుంది- వారులో చాలామంది ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చారు, వారు ఇక్కడ ఓటర్లుగా నమోదు చేయబడతారు.
ప్రతి ఎన్నికల ప్రచారంలో ప్రాథమిక అంశాలు స్థిరంగా ఉంటాయి: సరైన ఓటర్లను గుర్తించడం, నమోదు చేయడం, ఒప్పించడం మరియు ఓటు వేయించడంటార్గెటింగ్ ప్రక్రియకు ఖచ్చితత్వాన్ని తీసుకొని రావడానికి డేటా మరియు డిజిటల్ ఏమి చేస్తాయి.నేటి ప్రపంచంలో డిజిటల్ టెక్నాలజీ మరింత ప్రభావం చూపుతుంది మరియు రాబోయే నెలల్లో మరియు సంవత్సరాల్లో డిజిటల్ టెక్నాలజీ మరింత రూపాంతరం చెందుతుంది.
డిజిటల్ రాజకీయ నాయకులు
కరోనా మహమ్మారి సోకిన భారతదేశంలో, స్మార్ట్ఫోన్ లేకుండా జీవించడం ఇప్పుడు దాదాపు అసాధ్యం.రైలులో వెళ్లాలనుకుంటున్నారా – మీకు ఆరోగ్య సేతు యాప్ అవసరం.నేర్చుకోవాలనుకుంటున్నారా-పాఠశాల ఇప్పుడు ఆన్లైన్లోనికి వచ్చింది.హాస్పిటల్ బెడ్లు ఎక్కడ ఉన్నాయో తనిఖీ చేయాలనుకుంటున్నారా – యాప్ ఈ విషయాన్ని మీకు తెలియజేస్తుంది.స్టోరుకు వెళ్లే ప్రమాదం లేకుండా ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటున్నారు-దాని కోసం ఒక యాప్ ఉంది.కాస్తంత సమయం గడపాలని కోరుకుంటున్నారా- దాని కోసం చాలా యాప్లున్నాయి.
కొన్ని సంవత్సరాల క్రితం వరకు, భారతదేశం డిజిటల్ శకం రాతి యుగంలో ఉంది.జియో ప్రారంభించడం, ఆ తరువాతి టెలిఫోన్ కంపెనీల మధ్య ధరల యుద్ధాలు మొదలు కావడంలో చాలా భారతీయ గృహాలకు చౌకైన డేటాతో సరసమైన ఫోన్ అందించే అవకాశాన్ని సృష్టించాయి.ఈ డిజిటల్ ఫౌండేషన్ రాజకీయ నాయకులు తమ పనిని సక్రమంగా చేసుకోవడానికి దోహదపడుతోంది.
ప్రాథమిక స్థాయిలో, రాజకీయ నాయకులు ఐదు కీలకమైన పనులు చేయాల్సి ఉంటుంది: పార్టీ వర్కర్లు మరియు స్వచ్ఛంద సేవకుల సోపానాన్ని నిర్వహించడం; వారి నియోజకవర్గాల్లో ఓటరు ఫైల్ను రూపొందించడం; వారి సందేశాన్ని చేరడానికి తన మద్దతుదారులతో (పార్టీ విధేయులు మరియు కొంతమంది నాన్-అలైన్డ్) కమ్యూనికేట్ చేయడం; ఓటర్ల నుండి వారు వేదన అనుభవించే విషయాలు మరియు అంచనాలపై ఫీడ్బ్యాక్ పొందడం; ఎన్నికల రోజున ఓటు వేయడానికి బూత్లకు వచ్చేలా చేయడం.
ఈ పనులన్నింటిని కూడా మరింత సమర్థవంతంగా చేయడానికి డిజిటల్ మాధ్యమం ఇప్పుడు వారికి సహాయపడుతుంది.నిమగ్నతను ట్రాక్ చేయడానికి కార్పొరేట్ ప్రపంచం మరియు కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ (CRM) వ్యవస్థలను సృష్టించే అనేక సమాంతరాలు ఉన్నాయి.రాజకీయాలకు, అదేవిధంగా వ్యాపారానికి మధ్య ఉన్న ఒక పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, రాజకీయాల్లో రెండవ స్థానంలో వచ్చినందుకు ఎలాంటి బహుమతులు ఉండవు- తప్పు ఎక్కడ జరిగిందని గుర్తించి, తదుపరి ఎన్నికలకు సిద్ధమవుతూ ఐదు సంవత్సరాలు గడపాల్సి ఉంటుంది.
విజయమే లక్ష్యంగా సాగే నేటి రాజకీయాల్లో, డిజిటల్ మాధ్యమం ఇప్పుడు గొప్ప ప్రభావాన్ని చూపుతోంది.ఓటర్లు ఇప్పటికే వివిధ రకాలైన తమ కార్యకలాపాల కొరకు డిజిటల్ని ఆశ్రయించారు- రాజకీయ నాయకులు సైతం ఈ డిజిటల్ శకంలో ముందు వరసలో నిలబడటానికి ఇదే మంచి తరుణం.
ఈ ఆఫ్లైన్-నుంచి-ఆన్లైన్కు మారడం వల్ల గత కొన్ని నెలల్లో అనేక వినియోగదారుల ఎదుర్కొంటున్న వ్యాపారాలకు ఏమి జరిగిందో ప్రతిబింబిస్తుంది.చాలా వ్యాపారాలు, అది ఓమ్నిచానెల్గా కాకుండా- అది కేవలం ఆన్లైన్లో మాత్రమే ఉండాలి.రాజకీయ నాయకులకు, ఇది వర్తిస్తుంది.ప్రత్యక్షంగా కాంటాక్ట్ చేయడం గురించి అమితంగా జాగ్రత్త పడుతున్న నేటి ప్రపంచంలో, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు మరియు ఓటర్లతో ఇంటర్ఫేస్ డిజిటల్గా మారాలి.
ఒక డేటాబేస్, మూడు యాప్లు
రాజకీయ నాయకులు చేయాల్సిన ఐదు పనుల చేయడానికి డిజిటల్ రాజకీయాలకు ఒక డేటాబేస్, మూడు యాప్లు అవసరం.ప్రారంభ స్థానం ఓటరు డేటాబేస్గా ఉండాలి.చాలా మంది రాజకీయ నాయకులు గత కొన్నేళ్లుగా వీటిని రూపొందించడం ప్రారంభించారు.ఇది ఇప్పుడు అన్ని కమ్యూనికేషన్లు మరియు ఇంటరాక్షన్లను కేంద్రం అవుతుంది.
ఈ డేటాబేస్, చాలా సంవత్సరాలుగా కన్స్యూమర్ బ్రాండ్లున్న కంపెనీలు ఉపయోగించే కస్టమర్ డేటా ప్లాట్ఫారం (CDP)లానే ఉంటుంది.CDP మొత్తం కస్టమర్ డేటాను ఒకే రిపోజిటరీలో సమగ్రం చేస్తుంది.ఇందులో గుర్తింపు (పేరు, ఇమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్), డెమోగ్రాఫిక్ సమాచారం (వయస్సు, లింగం, స్థానం), ప్రవర్తనా డేటా (యాప్ లేదా వెబ్సైట్లో చేసిన చర్యలు) మరియు లావాదేవీల డేటా (చేసిన అన్ని కొనుగోళ్ల వివరాలు) ఉంటాయి.మొత్తంగా చూస్తే, CDP ప్రతి కస్టమర్కు సంబంధించిన ఏకీకృత వీక్షణ అందిస్తుంది.
రాజకీయ నాయకులకు, ఓటరు ఫైలు CDPకి సమానం.ప్రతి ఓటరు కోసం, మొత్తం సమాచారం సేకరించాలి మరియు ఓటరు ఐడి, మొబైల్ నెంబర్, లాయల్టీ లెవల్ మరియు ఓటు వేయడానికి అవకాశం వంటి వివరాలను సింగిల్ డేటాబేస్లో పెట్టాలి.ఓటరు రికార్డులతో, రాజకీయ నాయకుడికి ఆ ప్రదేశం గురించి, ఎటువంటి పథకాలు ఓటర్లకు ప్రయోజనం చేకూర్చాయనే విషయం కూడా కావాలి.వీటన్నింటిని సమకూర్చుకున్న తరువాత, వ్యాపార సంస్థలు తమ వినియోగదారులతో ఏవిధంగా అయితే చేస్తాయో అలానే రాజకీయ నాయకుడు ప్రతి ఓటరుతో వ్యక్తిగతమైన సమాచారాన్ని పంచుకోవడం సాధ్యమవుతుంది.
డేటాబేస్ ఏర్పాటు చేసిన తర్వాత, డిజిటల్ టెక్నాలజీపై ఆసక్తి ఉండే రాజకీయ నాయకుడికి మధ్యవర్తుల-పార్టీ వర్కర్లు మరియు వాలంటీర్లను నిర్వహించడానికి ఒక యాప్ అవసరం అవుతుంది.ఇది సాధారణంగా వాట్సాప్ మరియు ఫోన్ మరియు వ్యక్తిగత కాంటాక్ట్ల సమ్మిళితంగా జరుగుతుంది.సోపానక్రమం సృష్టించడానికి, కేటాయించిన పనులు మరియు కార్యకలాపాలను పర్యవేక్షించే మెరుగైన వ్యవస్థకు అప్డటే్ అవసరం అవుతుంది.ఉద్యోగులను మానిటర్ చేయడానికి కార్పొరేట్ల్లోని మేనేజర్లకు ఏవిధంగా అయితే యాప్లు అవసరం అవుతాయో, అదేవిధంగా రాజకీయ నాయకులు తమ తరువాత తరంతో నిమగ్నం కావడానికి యాప్ అవసరం అవుతుంది.
రెండో యాప్ ఓటర్ కమ్యూనికేషన్ మరియు నిమగ్నత కొరకు.సమీప భవిష్యత్తులో రాజకీయ నాయకులు భారీగా బలప్రదర్శన చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో, వారి ముఖం, పార్టీ చిహ్నం మరియు సందేశం అదేస్థాయిలో ర్యాలీలకు సమానంగా ఉండేందుకు డిజిటల్ ఈవెంట్లు మరియు ర్యాలీలు అవసరం అవుతాయి.స్టెరాయిడ్లపై జూమ్ చేయడం గురించి ఆలోచించండి.
వ్యక్తిగత సంభాషణలకు అవకాశం లేకపోవడం వల్ల ప్రజలు ఏమి భావిస్తున్నారనే దానిపై మంచి ఫీడ్బ్యాక్ పొందడానికి రాజకీయ నాయకులు సర్వేలు సైతం నిర్వహించాల్సిన అవసరం ఉంది.చాయ్ పే చర్చ వంటి ప్రచార కార్యక్రమాలు స్క్రీన్ సే చర్చాగా పరివర్తన చెందాలి.ఈ ఏడాది చివర్లో జరగబోయే బీహార్ రాష్ట్ర ఎన్నికలకు ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో దీని ప్రారంభ సంకేతాలను మనం ఇప్పటికే చూస్తున్నాం.
మూడవ యాప్ బూత్ నిర్వహణ కోసం అవసరం.సాధారణ లోక్సభ నియోజకవర్గంలో దాదాపుగా 1500-2000 వరకు బూత్లు ఉండగా, విధానసభ నియోజకవర్గంలో 200-300 బూత్లు ఉంటాయి.ప్రతి బూత్లో వెయ్యి మంది ఓటర్లు (సుమారు 250 గృహాలు) ఉంటాయి.పోలింగ్ రోజుకు దగ్గరగా, ఎన్నికల రోజున ఓటర్లను ఒప్పించటానికి, ఓటు వేసలా బూత్ వర్కర్లు మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది.బీహార్, తమిళనాడు, పశ్చిమ ప్రాంతం బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు డిజిటల్ బూత్ మేనేజ్మెంట్ ఏవిధంగా పనిచేస్తుందనే దానికి ఒక పరీక్షగా నిలుస్తుంది.
మొత్తంగా చూస్తే, పార్టీ వర్కర్లతో సమన్వయం కొరకు మూడు యాప్లతో కూడిన ఓటరు డేటాబేస్, ఓటర్లో టూ వే కమ్యూనికేషన్ల మార్పిడి మరియు బూత్ మేనేజ్మెంట్లు రాబోయే రోజుల్లో డిజిటల్ రాజకీయాలకు పునాది వేస్తాయి.
ముగింపుగా
ఓటర్తో నిమగ్నం కావడం నుంచి ఆఫ్లైన్ నుండి ఆన్లైన్కు మార్చడంతో పాటు, కరోనా మహమ్మారి రాజకీయాల్లో మరో మూడు మార్పులను కూడా తెస్తుంది.
మొదట, ఇది మరింత యువ రాజకీయ నాయకులను ప్రోత్సహిస్తుంది.వృద్ధులు వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల, పాత రాజకీయ నాయకులు వ్యాక్సిన్ లభించే వరకు బయటకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడరు.
రెండోది, ప్రజలు ఎక్కువ ఆర్థిక బాధలను అనుభవిస్తుండటంతో, మెరుగైన రేపటికి సంబంధించిన విజన్కంటే ఇప్పుడు ఎక్కువగా డబ్బు లభించే పరిష్కారాలు ఆమోదయోగ్యమైనవి.మరో మాటలో చెప్పాలంటే, మెరుగైన భవిష్యత్తు అందిస్తాం అని వాగ్ధానం చేసేవారికంటే వర్తమానంలో డబ్బును అందించడానికి ప్రయత్నించే రాజకీయ నాయకులకు మద్దతు లభిస్తుంది.
అప్పుడు, రాజకీయ నాయకులకు విరుద్ధంగా సెంటిమెంట్ మారే ప్రమాదం ఉంది.కరోనా మహమ్మారి తన వ్యాప్తిని కొనసాగిస్తే, లాక్డౌన్-అన్లాక్ రెండూ కొనసాగితే ప్రజల్లో కోపం పెరుగుతుంది.భారతీయులు ఎంతో సహనంగా ఉండేవారైనప్పటికీ, ఏదో ఒక సమయంలో, వారిలో ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా కోపం పెరగడం మొదలవుతుంది.
రాజకీయ నాయకులు డిజిటల్ వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ, రాజకీయ విఘాతం సృష్టించడానికి ఛాలెంజర్లు కొత్త వేదికలు మరియు మార్కెట్ ప్రదేశాలను సృష్టించగలరా?భారతదేశాన్ని కొత్త మార్గంలో నడిపించడానికి, భారతీయులను పేదలుగా ఉంచిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటే, అది ఈ క్షణమే.డిజిటల్ రంగంపై మక్కువ ఉన్న ఉన్న రాజకీయ వ్యవస్థాపకులారా దీనిని వింటున్నారా?
This is a translation of the original essay written in English by Rajesh Jain for Mint (July 31, 2020). If you find any errors, please rajesh@nayidisha.com.